LPG e-KYC Deadline Alert

ఎల్‌పీజీ గ్యాస్ కస్టమర్లకు కేంద్రం షాకింగ్‌ న్యూస్‌
కస్టమర్లకు ఇండియన్ ఆయిల్ కొత్త అడ్వైజరీ
జూన్ 30 లోగా ఈ-కేవైసీ చేయకపోతే సబ్సిడీ కట్!
ఇండేన్ గ్యాస్ కస్టమర్లు ఇండియన్ ఆయిల్ వన్ యాప్ ద్వారా ఈకేవైసీ
భారత్ గ్యాస్ కస్టమర్లు హలో బీపీసీఎల్ యాప్‌ ద్వారా ఈకేవైసీ
హెచ్‌పీ గ్యాస్ కస్టమర్లు హెచ్‌పీ పే యాప్ ద్వారా ఈకేవైసీ
ఇంట్లో కూర్చునే eKYC చేసుకోవచ్చు


మీకు ఎల్‌పీజీ గ్యాస్ కనెక్షన్ ఉందా? అయితే మీకో బిగ్‌ అలర్ట్. ప్రభుత్వం నుంచి గ్యాస్ సబ్సిడీ పొందుతున్న ప్రతి వినియోగదారుడు జూన్ 30 లోగా తమ ఈ-కేవైసీ (eKYC) ప్రక్రియను తప్పనిసరిగా పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం మరియు చమురు సంస్థలు స్పష్టం చేశాయి. ఈ గడువులోగా కేవైసీ పూర్తి చేయని పక్షంలో సబ్సిడీ ఆగిపోయే ప్రమాదం ఉంది.

ఈ-కేవైసీ ఎందుకు తప్పనిసరి?

ప్రపంచవ్యాప్త ఇంధన సరఫరాలో కీలకమైన ‘స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్’ మార్గంలో ఏర్పడిన అంతరాయాల వల్ల ఎల్‌పీజీ సరఫరాపై ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో సబ్సిడీ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు మరియు అర్హులైన లబ్ధిదారులను గుర్తించేందుకు ఆధార్-బయోమెట్రిక్ అథెంటికేషన్‌ను ప్రభుత్వం మ్యాండేటరీ చేసింది.

ఎవరు చేయాలి?

  • ఉజ్జ్వల పథకం లబ్ధిదారులు: వీరికి ఇది తప్పనిసరి.
  • సాధారణ వినియోగదారులు: సబ్సిడీ పొందుతున్న ప్రతి ఎల్‌పీజీ కస్టమర్ జూన్ 30 లోపు ఈ ప్రక్రియ పూర్తి చేయాలి.
  • గమనిక: మీరు ఇదివరకే ఈ-కేవైసీ పూర్తి చేసి ఉంటే, మళ్లీ చేయాల్సిన అవసరం లేదు.

ఈ-కేవైసీ ఎలా పూర్తి చేయాలి?

వినియోగదారులు తమ గ్యాస్ సంస్థను బట్టి కింద పేర్కొన్న యాప్‌ల ద్వారా ఇంటి వద్ద నుంచే సులభంగా కేవైసీ చేసుకోవచ్చు:

  • ఇండేన్ (Indane): ‘ఇండియన్ ఆయిల్ వన్’ (IndianOil ONE) యాప్ లేదా ఆధార్ ఫేస్ ఐడీ యాప్.
  • భారత్ గ్యాస్ (Bharat Gas): ‘హలో బీపీసీఎల్’ (Hello BPCL) యాప్.
  • హెచ్‌పీ గ్యాస్ (HP Gas): ‘హెచ్‌పీ పే’ (HP Pay) యాప్.

ఈ ప్రక్రియ పూర్తిగా ఉచితం. ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయడం ద్వారా లేదా ఆధార్ ఫేస్ ఐడీ యాప్ ద్వారా మీ ఫేస్ అథెంటికేషన్ పూర్తి చేయడం ద్వారా ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తవుతుంది. ఒకవేళ ఆన్‌లైన్‌లో ఇబ్బందులు ఉంటే, మీ పరిధిలోని గ్యాస్ ఏజెన్సీని నేరుగా సంప్రదించి కూడా పూర్తి చేయవచ్చు.

సబ్సిడీని కోల్పోకండి

ప్రస్తుతం కేంద్రం ఉజ్జ్వల పథకం కింద ప్రతి సిలిండర్‌పై రూ.300 సబ్సిడీని అందిస్తుండగా, తెలంగాణ ప్రభుత్వం అర్హులైన కుటుంబాలకు రూ.500 కే గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేస్తోంది. సబ్సిడీ డబ్బులు ఎలాంటి అంతరాయం లేకుండా నేరుగా మీ బ్యాంక్ ఖాతాల్లో జమ కావాలంటే, గడువు ముగిసేలోపే ఈ ఆధార్-ఆధారిత ఈ-కేవైసీని పూర్తి చేసుకోగలరు.

Leave a Reply

Your email address will not be published.